రక్తదానం చేద్దాం ఎదుటి వారికి మరో జన్మ నిద్దాం: జనసేన జానీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం కిమ్మి గ్రామ జనసైనికుడు తండ్రి పల్లీ అప్పలనాయుడుకి ఆరోగ్యం బాగులేకపోవడంతో చికిత్స నిమిత్తమై అత్యవసరంగా రక్తం బి పాజిటివ్ గ్రూప్ బ్లడ్ అవసరం అని చెప్పడంతో.. కిమ్మి గ్రామ జనసేన నాయకులు రౌతు గోవింద నాయుడు వీరఘట్టం మండల జనసేన నాయుకులు బొడ్లపాడు జనసేన జానీకి చెప్పడంతో.. స్వయంగా జనసేన జానీ వెళ్ళి రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా జానీ మాట్లాడుతూ ఎవ్వరికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ జనసేన నాయుకులు నుంచి జనసైనికులు ఎప్పుడు ముందు ఉంటారని.. రక్తదానం చేద్దాం మనిషిగా బ్రతుకుదాం.. ఏ తల్లీ కన్నీరు తన బిడ్డను కాపాడలేదు కానీ.. మనం చేసే రక్తం ఆ మనిషిని కాపాడగలదు.. అని నలుగురుతో బ్రతికేవాడుకాదు నలుగురుని బ్రతికించే వాడుమనిషి అని చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించారు అని జనసేన జానీ చెప్పడం జరిగింది. జనం కోసం జనసేన ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసారు.