మహాత్ముని స్ఫూర్తితో వైకాపా అవినీతి ప్రభుత్వంపై కలిసి కట్టుగా పోరాడదాం

  • గాంధీ జయంతి రోజున టిడిపి చేపట్టిన సత్యమేవ జయతే దీక్షకు జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలుపుతూ నిరాహార దీక్షలో పాల్గొన్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత

అనంతపురం: టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రి జైలులో చేస్తున్న సత్యమేవ జయతే దీక్షకు మద్దతుగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేస్తున్న దీక్షకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలిపి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్షలో పాల్గొన్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సత్యం అహింస మార్గాల ద్వారా దేశాన్ని ఏకం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం ఎలాగైతే పోరాడి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టి స్వతంత్రం సిద్దింపచేసారో ప్రస్తుతం ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అక్రమ అరెస్టును, అవినీతి పాలనను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి అనంతపురం నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, వీర మహిళలు గాయత్రి, దర్భి, కుళ్ళయమ్మ, వరలక్ష్మి, లక్ష్మి, జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.