నాగబాబు చిత్తూరు పర్యటనను విజయవంతం చేద్దాం: డాక్టర్ పసుపులేటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబును, నేషనల్ మీడియా ఇంఛార్జి అజయ్ కుమార్ లను జిల్లాలో పర్యటించి సమీక్ష నిర్వహించే విధంగా ఆదేశించారు. నాగబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఏడు నియోజకవర్గాల నాయకులతో సమావేశాలను నిర్వహించారు. ప్రతి నియోజకవర్గము నుండి పార్టీ యొక్క కార్యక్రమాలను, నియోజకవర్గ సమస్యలను మండల అధ్యక్షులతో చర్చించుకుని ప్రతి మండలంలో ఉన్న బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకుని నాగబాబు గారికి తెలియజేయాలని సూచించారు. పార్టీలో కొత్తవారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి తగిన సమస్త న్యాయం కలిగేలాగా చూసుకోవాలని తెలియజేశారు. సామాజిక మాధ్యమాలలో పార్టీకి ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ కో కన్వినర్ రాందాస్ చౌదరి, చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తులసి ప్రసాద్, జంగాల శివరాం, దారం అనిత, జిల్లా కార్యదర్శులు ఆనంద్, పసుపులేటి దిలీప్, పగడాల రమణ, యశ్వంత్, రామ్ మూర్తి, బాటసారి, నియోజకవర్గంలో పనిచేస్తున్న రాష్ట్ర నాయకులు & జిల్లా నాయకులు ఆనంద్, హేమకుమార్, బాటసారి, మండల అధ్యక్షులు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.