పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేద్దాం: జాగరపు పవన్ కుమార్

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలం, వనబంగి గ్రామంలో శనివారం జనసేన పార్టీ అరకు అసెంబ్లీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ వనబంగి గ్రామస్తులకు జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా, గిరిజన ప్రాంత బిడ్డలకు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని, ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న ఏకైక పార్టీ మన జనసేన అని, రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డా జనసేనకు మద్దతునిచ్చి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేద్దామని గ్రామస్తులకు పిలుపునివ్వడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గిరిజన బిడ్డలపై చేసే అరాచకాలు చిన్నపిల్లల నుండి మొదలుకొని పెద్దవారి దాకా ఈ ప్రభుత్వ అరాచకాలు తెలిసినవే కావున రాబోయే కాలంలో మన జనసేన పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. మన గిరిజన ప్రాంతం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని తెలియపరచటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విరమహిళలు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.