జనసేనాని సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్దాం: టీ.సీ.వరుణ్

*జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టీ.సీ.వరుణ్

*యువతకు ప్రాధాన్యత..

అనంతపురము అర్బన్: అనంతపురం నగరంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో 41వ డివిజన్ నుండి వైఎస్ఆర్సిపి నాయకులు జనసేన పార్టీ నగర కార్యదర్శి శ్రీమతి.సువర్ణమ్మ, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టీ.సి.వరుణ్ సమక్షంలో కండువా వేసి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అర్బన్ ఇంచార్జ్ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ మాట్లాడుతూ జనసేన పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంతో పాటు.. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని జనసేన జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. అలాగే జనశక్తి నగర్ కాలనీ వాసులకు ఇల్లు పట్టాలపై స్థానికంగా ఉన్న సమస్యలు… ఎదురవుతున్న ఇబ్బందులు.. యువతకు ఉపాధి అవకాశాలు లేక పడుతున్న కష్టాలు.. తదితర వాటి గురించి టి.సి.వరుణ్ వారితో చర్చించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత వైసిపి ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోతోందని.. ప్రభుత్వ నోటిఫికేషన్లు, పరిశ్రమల స్థాపన లేకపోవడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుమరుగైనయని అని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాలంటే అది ఎంతో చిత్తశుద్ధి కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుందని… అలాంటి పవన్ కళ్యాణ్ గారికి యువత అంతా బాసటగా నిలవాలని సూచించారు. అలాగే జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలపై స్పందిస్తూ… వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మీకు అన్ని విధాలుగా తాను అండగా ఉండటంతో పాటు.. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారి మార్గంలో పయనించి.. పన్నుల బాదుడుతో ప్రజలను అష్టకష్టాలు పెడుతున్న వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అలాగే జాయిన్ అయినవారు మహేష్, నాగప్ప, వెంకటరాముడు, వెంకటేష్ మహేష్, లక్ష్మీనారాయణ, శేషాద్రి, విశ్వనాథ్, గోవర్ధన్, సాయి, శర్మాస్, సోమశేఖర్, రాజా, గోపాల్, శేషాద్రి గిరి, రాజు, రాము, గణేష్, సునీల్, సాయి నవీన్, బంగారు, మారెప్ప పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర్ కమిటీ సభ్యులు మరియు నాయకులు పాల్గొనడం జరిగింది.