గాఢ నిద్రలో ఉన్న సీఎం ను మేలుకొల్పుదాం!: రాజోలు జనసేన

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం, టెకిశెట్టిపాలెం గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు #GoodMorningCMSir కార్యక్రమంలో భాగంగా టెకిశెట్టిపాలెం జనసేన పార్టీ తరుపున క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్,మండెల బాబి నాయుడు, టేకిశేట్టిపాలెం సర్పంచ్ విస్సా దేవిదుర్గ తాతయ్య నాయుడు, ఉపసర్పంచ్ కటికిరెడ్డి మహేష్, గ్రామ శాఖ అధ్యక్షులు రావూరి తేజ ముఖేష్, మండల నాయకులు ముత్యాల గణేష్ నాయుడు యువజన నాయకులు పోతు బాబీ, రేకపల్లి స్వామి, గిడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.