జనసేన, టిడిపి అభ్యర్థి గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం

  • శ్రీమతి అథితి విజయలక్ష్మి గజపతిరాజుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి

విజయనగరం: జనసేన ~ టిడిపి ఉమ్మడి అభ్యర్థినిగా శ్రీమతి పూసపాటి అధితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికైన శుభసందర్భంగా మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమనంతరం ఇరు పార్టీల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.