కొణిదెల నాగబాబును కలసిన మదనపల్లె జనసేన నాయకులు

అనంతపురం విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కొణిదెల నాగబాబు ను రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి ఆదేశాలు మేరకు మదనపల్లె జనసేన నాయకులు, జనసైనికులు మర్యాదపూర్వకంగా కలిసి త్వరలో మదనపల్లెకి రావలసిందిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, మదనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, ఐటి వింగ్ జగదీష్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి రెడ్డమ్మ, ప్రసాద్ రాయల్, టౌన్ కార్యదర్శి జనార్ధన్,
రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర పాల్గొన్నారు.