నిన్న ప్రభాస్.. నేడు మహేష్ !

కరోనా సెకండ్ వేవ్ దేశంలో పూర్తిస్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. మరి కొంతమంది ఏకంగా ప్రాణాలనే కోల్పోతున్నారు.ఇదిలా ఉండగా ఇటీవల యంగ్ స్టార్ ప్రభాస్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లగా ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కాగా మహేష్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ రావటంత హోమ్ ఐసోలేషన్ కి వెళ్లినట్లు సమాచారం. డాక్టర్ల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక దీంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లే. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తున్నారు.