ఆక్వా రైతుల ఆక్రందన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ

రాజోలు: సోమవారం జనసేన పార్టీరాష్ట్ర పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆక్వా రైతుల ఆక్రందన ఈనెల 30వ తారీఖున అమలాపురంలో గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్ కి విజ్ఞాన పత్రం అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజోలు నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వీరితోపాటు అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.