చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సభను విజయవంతం చేయండి – ఎన్డీఏ కూటమి పిలుపు

తిరుపతి: జనసేన – టిడిపి అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మే 7న తిరుపతికి విచ్చేయనున్నారు. తిరుపతిలో వారు ప్రచారం నిర్వహించి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన, బిజెపి నేతలు ఆదివారం ముఖ్య సమావేశం ఏర్పాటు చేసి, ఈ భారీ బహిరంగ సభను మూడు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మూడు పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు.