జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయవంతం చేయండి

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం సోమవారం ప్రారంభమైంది. కావున సభ్యత్వ నమోదు చేసుకుని పార్టీ బలోపేతంలో భాగస్వాములు కావాలని కార్యకర్తలకు జనసేన నాయకులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు నగరంలోని స్థానిక సప్తగిరి సర్కిల్ లో జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు , జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శి నాగేంద్ర.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి జనసేన కార్యకర్త పార్టీ సభ్యత్వం చేసుకొని అదేవిధంగా ఇప్పటికే సభ్యత్వం తీసుకుని ఉంటే ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకుని.. ప్రతి జనసేన కార్యకర్తకూ.. ఈ సమాచారం తెలిపి జనసేన పార్టీ సభ్యత్వం చేసుకునేవిధంగా ప్రోత్సహించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం, 50,000 రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు.. ఏదైనా ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు జనసేన పార్టీ తరుపున అందించి వారి కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. కావున ప్రతి జనసేన కార్యకర్త సభ్యత్వం లో భాగస్వాములై సభ్యత్వం రెన్యువల్ చేసుకుని మిగిలిన కార్యకర్తలకు సభ్యత్వం, రెన్యువల్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, చొప్పా చంద్ర, కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులు జయమ్మ, విజయ్ కుమార్, పురుషోత్తం రెడ్డి, నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళ రూప పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *