ఆరెంజ్‌ రీరిలీజ్‌ను విజయవంతం చేయండి: గురాన అయ్యలు

విజయనగరం, తెలుగువారి ఖ్యాతి ప్రపంచ నలుదిశలా చాటిచెప్పి, ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర కథానాయకుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనెల 25, 26 తేదీల్లో క్లాసిక్‌ ప్రేమ కథా చిత్రం ఆరెంజ్‌ని రీరిలీజ్‌ చేస్తున్నారని జనసేన నాయకులు గురాన అయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరెంజ్‌ రీరిలీజ్‌ని ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పలు థియేటర్లలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఆరెంజ్‌ రీరిలీజ్‌ను జనసేన పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆరెంజ్‌ రీరిలీజ్‌ ద్వారా వచ్చే ప్రతీ రూపాయిని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని చిత్ర నిర్మాత నాగబాబు ప్రకటించారన్నారు. ఈ ప్రకటనతో జనసేన పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారన్నారు. అలాగే ఈనెల 27వ తేదీన రామ్‌చరణ్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, మెగా అభిమానులకు పిలుపునిచ్చారు.