జనసేన పాదయాత్రను విజయవంతం చేయండి..

గోపాలపురం నియోజకవర్గం: గోపాలపురం మండలం, జగన్నాధపురం గ్రామంలోని సోమవారం మండల నాయకులు పోసిన గణపతి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణ రాజు, గ్రామంలోని వైసిపి, టిడిపి పార్టీల నుండి జనసేన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్న కొంతమంది యువకులతో సువర్ణ రాజు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క విధానాలు వివరించడం జరిగింది. నియోజకవర్గంలో గాని, మండలంలో నాయకుల సమక్షంలో మేము చేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అనంతరం అక్కడ ఉన్న జనసైనికులతో మరియు కార్యకర్తలతో గ్రామ కమిటీ గురించి, మండల కమిటీలు గురించి, పార్టీ బలోపేతం గురించి రాష్ట్రంలో పార్టీ చేపట్టే రోడ్డు యాత్ర గురించి, సాగిపాడు రోడ్డు సంబంధించి గ్రామస్తులు పడిన ఇబ్బందులను చర్చించి ఇక్కడ ఉన్న జనసైనికులతో పాటు గ్రామ ప్రజలను కూడా మనం చేపట్టబోయే పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను, రాహుల్, యోగేష్, వెంకటేశ్వరరావు, నాగనరేష్, యుగంధర్, రాజేష్, జగదీష్, రవిచంద్రన్, మధు, శ్రీను, రాంబాబు, కిషోర్, స్వామి, గంగరాజు, దుర్గారావు, కిషోర్, సతీష్, శ్రీను, సూరిబాబు, మరియు జనసేనకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.