వారాహి యాత్ర విజయవంతం చేయండి: వబ్బిన సన్యాసి నాయుడు

శృంగవరపుకోట నియోజకవర్గము: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన 3వ విడత వారాహి యాత్ర ఆగస్టు 10న విశాఖలో జరుగుతుంది. ఈ నేపధ్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం 10 గంటలకి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని సాయంత్రం 4గంటలకి జగదాంభ జంక్షన్ లో వారాహి విజయయాత్ర బహిరంగ సభలో ప్రసంగిస్తారు కనుక శ్రుంగవరపుకోట నియోజకవర్గ జనసైనికులు ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చెయ్యాలని జనసేన పార్టీ ఎస్ .కోట నియోజకవర్గము సీనియర్ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు.