వారాహి యాత్రను విజయవంతం చేయండి: డాక్టర్ పిల్లా దీపిక శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: జూన్ 14వ తేదీ నుండి అన్నవరంలో ప్రారంభం కాబోవు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపిక పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి పిఠాపురం నియోజకవర్గంలో జరగబోవు వారాహి యాత్రకు బొట్టు పెట్టి మహిళలను ఆహ్వానించారు. అదేవిధంగా సెక్షన్ 30 విధించడంపై డాక్టర్ పిల్లా శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రను అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులు ద్వారా సెక్షన్ 30 అమల్లోకి తీసుకొని వచ్చాడని డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆరోపించారు. వారాహి యాత్రను ఏ శక్తి ఆపలేదు అని పోలీసులు వెంటనే సెక్షన్ 30ని విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.