కరణం సూరిబాబును జనసేన పార్టీలోకి ఆహ్వానించిన మాకినీడి

పిఠాపురం టౌన్ లో శుక్రవారం మేళం రామకృష్ణ పి.ఎస్ మూర్తి ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త జై గణేష్ టైల్స్ షాప్ కరణం సూరిబాబును వారి అనుచరులను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషు కుమారి మర్యాదపూర్వకంగా కలిసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టౌన్ మహిళా ప్రెసిడెంట్ కోల దుర్గ, జనసేన పార్టీ నాయకులు కసిరెడ్డి నాగేశ్వరరావు, బొజ్జ కుమార్, గరగ బాబి, పబ్బినిడి దుర్గాప్రసాద్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.