యువశక్తిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం, జనవరి 12వ తేదీన జరగబోయే యువశక్తి బహిరంగ సభ కార్యక్రమానికి యువత భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మా ఇంచార్జి మాకినీడి శేషుకుమారి విదేశి పర్యటనలో ఉండటం వల్ల ఆమె పిలుపు మేరకు మేము యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోపు సురేష్, బుర్రా సూర్యప్రకాష్, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకర్ రావు, కంద సోమరాజు, కసిరెడ్డి నాగేశ్వరావు, పబ్బినీడి దుర్గ ప్రసాద్, వీరంరెడ్డి అమర్, దేశిరెడ్డి సతీష్, కరపురెడ్డి వెంకటేష్, దువ్వ వీరబాబు, కీర్తి చంటి, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.