శశి పెయింట్స్ షాప్ నూతన ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం పట్టణంలో మిరపకాయలు వీధిలో ఉదయం 10 గంటలకు శశి పెయింట్స్ షాప్ నూతన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి షాపు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ… జనసైనికులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, షేక్ రంజన్ ఆహ్వానం మేరకు ఇక్కడకు రావడం ఆడపడుచులు అన్నదమ్ములతో కలిసి షాప్ ఓపెనింగ్ చేయడం ఆనందంగా ఉందని, వీరి వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, జనసేన నాయకులు పుణ్యమంతుల మూర్తి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వేణు నారాయణరావు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, షేక్ రంజన్, మేళం బాబి, నెయ్యికాపుల సురేష్, కసిరెడ్డి నాగేశ్వర రావు, పబ్బినీడి దుర్గాప్రసాద్, నామ శ్రీకాంత్, చిన్నారి అంజి, కొమ్మిరెడ్డి అనిల్, కరణం కెపి, చాగంటి శివాజీ, జువ్వల ఏసుబాబు, కె. శివ, వీరమహిళలు సీత, కాంతం, దేవి, జ్యోతి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.