సోమిరెడ్డి వీర్రాజు కుటుంబాన్ని పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, యు.కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామంలో ఇటీవల లారీ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్త సోమిరెడ్డి వీర్రాజుకి సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఈనెల 4, 5 తేదీలలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రిలో అందజేయడం జరుగుతుందని జనసైనికులు నాయకులతో కలిసి పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి యండపల్లి గ్రామం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రామంలో జనసైనికులకు నాయకులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత నమోదు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని పార్టీ సిద్ధాంతాలు ప్రజలు అందరికీ తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చీకట్ల శ్యామ్ కుమార్, ఎంపీటీసీ అభ్యర్థి సోమిరెడ్డి సుబ్రమణ్యం, పెనుపోతుల నానిబాబు, సోమిరెడ్డి అంజి, సోమిరెడ్డి అయ్యప్పస్వామి, పెంట అప్పారావు, మిరియాల సత్తిబాబు, సోమిరెడ్డి సత్తిబాబు, ఎస్ స్వామి, ఎం నాగశక్తి, చేదులూరి గణేష్, అడపా చిన్న, ఎం కొండ, అర్జున్ రావు, వెంకన్న, ఆదినారాయణ, రేలంగి ఏసుబాబు, ఆంజనేయులు, మారిశెట్టి వెంకటరమణ, సత్తిబాబు, సత్యనారాయణ, సూరిబాబు, సముద్రం, రాజేష్, నామ దుర్గాప్రసాద్, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.