Coal scandalలో మమతా మేనల్లుడికి మరోసారి ఇడి సమన్లు

బెంగాల్‌ బొగ్గు కుంభకోణంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టిఎంసి ఎంపి అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 21న విచారణకు హాజరు కావాలని సమన్లలో ఆదేశించింది. వాస్తవానికి శుక్రవారమే ఢల్లీలోని ఇడి కార్యాలయంలో అభిషేక్‌ బెనర్జీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, విచారణకు హాజరుకావాలంటూ తనకు అతి తక్కువ సమయాన్ని ఇచ్చారని, అందువల్ల విచారణకు హాజరు కాలేనని ఇడికి ఆయన తెలిపారు. దీంతో సెప్టెంబర్‌ 21న విచారణకు రావాలని తాజాగా సమన్లలో పేర్కొంది.