ఏర్పేడు జనసేన మండల స్థాయి సమావేశం

జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదివారం ఏర్పేడు మండల కమిటీ సమావేశం రేణిగుంట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నిర్వహిస్తున్న నా సేన కోసం నా వంతు కార్యక్రమం మండలంలో విజయవంతం కొరకు చెయ్యాల్సిన కృషి, పార్టీ సంస్థాగతంగా గ్రామ స్థాయిలో బలపరచడం గురించిన ముఖ్య విషయాలు చర్చించడం జరిగింది. అనంతరం మండల కమిటీ సభ్యులు వారి వంతుగా పార్టీకి విరాళాలు అందించడం జరిగింది.