మ‌నోజ్ సినిమాలో మెగా హీరో

మంచు, మెగా ఫ్యామిలీ హీరోల‌ కాంబో మ‌రోసారి అభిమానుల‌ను ఖుషీ చేయ‌బోతోంది. అప్పుడెప్పుడో కెరీర్ తొలినాళ్ల‌లో మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు క‌లిసి ఫ్యాన్స్‌ను అల‌రించారు. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారు స్టార్‌డ‌మ్ సంపాదించుకుని.. మ‌ళ్లీ ఇద్ద‌రు క‌లిసి ఏ సినిమాలోనూ తార‌స‌ప‌డ‌లేదు. రెండు ఫ్యామిలీ నుంచి వార‌సులు వ‌చ్చినా.. వారు కూడా క‌లిసి న‌టించ‌లేదు. అయితే ఇప్పుడు ఆ స‌మ‌యం వ‌చ్చింది.

మంచు, మెగా హీరోలు క‌లిసి న‌టిస్తే చూడాల‌నుకునే ఫ్యాన్స్ కోరిక అతి త్వ‌ర‌లోనే తీర‌బోతోంది. శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో మంచు మ‌నోన్ న‌టిస్తున్న అహం బ్ర‌హ్మాస్మి సినిమాలో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సాయి ధ‌ర‌మ్ ఓ గెస్ట్ రోల్ చేస్తార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి గ‌తంలోనే ఈ ఇద్ద‌రు హీరోల‌తో..బిల్లారంగా మూవీని రీమేక్ చేస్తార‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. కానీ ప‌ట్టాలెక్క‌లేదు. సో ఈ విధంగానైనా వారు క‌లిసి వెండితెర‌పై మెర‌వ‌బోతున్నార‌న్నమాట‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *