మంథని జనసేన-బిజెపి ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

తెలంగాణ, మంథని జనసేన పార్టీ కార్యాలయంలో, మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాయ రమేష్ ఆధ్వర్యంలో మంథని నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. జనసేన-బిజెపి పొత్తులో భాగంగా చందుపట్ల సునీల్ రెడ్డిని జనసేన పార్టీ వీర మహిళలు, నాయకులు భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంథని మండల అధ్యక్షులు ఈరవేనా ఓం ప్రకాష్, కాటారం మండలం అధ్యక్షులు జనగాం పవన్, బూడిద అనిల్, సునీల్, మేకల శ్రావణ్, రమాదేవి, స్వరూప, మౌనిక, విజయ్ కుమార్, అనిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.