కుమారుడి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు భోజనం ఏర్పాట్లు చేసిన మనుబోలు శ్రీనివాసరావు

తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ఏ కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన తన కుమారుడు మనుబోలు వెంకట ధాత్రేష్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం 300 మంది విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేసిన కృష్ణాజిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మరియు పూర్వ విద్యార్థులు సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మనుబోలు శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు పుట్టినరోజు వేడుకలు లాంటి సందర్భాలలో పాఠశాలలో గాని దగ్గరలో ఉన్న ఆశ్రమాల్లోగాని వారి పిల్లల్ని తీసుకెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. అనంతరం పాఠశాల సిబ్బంది తోటి విద్యార్థిని విద్యార్థులు ధాత్రేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫోటో: చీమలపాడు ఉన్నత పాఠశాలలో పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న జనసేన కృష్ణా జిల్లా కార్యదర్శి మనుబోలు శ్రీనివాసరావు కుమారుడు, కుమార్తె.