బైపాస్ నిర్మాణం కోరుతూ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన మర్రాపు
గజపతినగరం నియోజకవర్గం: జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి బైపాస్ నిర్మాణం కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొండపల్లి మండలం, గరుడబిల్లి గ్రామంకి వెళ్లే ప్రధాన రోడ్డు మధ్యలో నాలుగు లైన్లు రైల్వే ట్రాక్ ఉండడంవల్ల తరచూ గేటు పడడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లడానికి వీలు లేకుండా, తరచూ ఎంతోమంది ప్రాణం కోల్పోవడం జరుగుతుంది, దీనిపై కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చి వెంటనే బైపాస్ నిర్మించి త్వరగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అద్దడా మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన, మండలం నాయకులు నాగా రాజు, పైడి రాజు, అప్పలనాయుడు, కామాదాసు, వెంకటేష్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-31-at-2.14.57-PM-1024x770.jpeg)