జనసేన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళిన మర్రిపాడు మండల జనసేన శ్రేణులు

అమెరికా జనసేన ఎన్నారై కనెక్టికట్ స్టేట్ నుండి శృతి కుమార్ సహయ సహకారాలతో ఏర్పాటు చేసిన మినీ వాహనంలో మర్రిపాడు మండల జనసేన శ్రేణులు మచిలీపట్నం ఆవిర్భావ సభా వేదికకు తరలి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా మర్రిపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి మండల ప్రధానకార్యదర్శి గంటా అంజి, మండల కార్యదర్శులు కన్నెమరకల హరికృష్ణ, పెనుమాది నరసింహా, రాయల్ పోలిచర్ల జనార్ధన్ చిన్నా జనసేన అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీలా ఒరుగంటి మాట్లాడుతూ .. ఈ వాహనం ఏర్పాటు చేసిన శృతి కుమార్ గారికి మర్రిపాడు మండల జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలిపారు.