వట్టెం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ పాదయాత్ర

  • పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా 21వ రోజు కార్యక్రమం

నాగర్ కర్నూల్, పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా రెండవ విడత కార్యక్రమంలో భాగంగా బిజినపల్లి మండలం, వట్టెం గ్రామంలో వంగ లక్ష్మణ్ గౌడ్ శనివారం పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమంలో జనసేన నాయకులతో, జనసైనికులతో కలిసి పాదయాత్రగా గ్రామంలో పర్యటించారు.. గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ.. కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు హారి నాయక్, బోట్క రమేష్, సూర్య, రాజు నాయక్, వంశీ రెడ్డి, లింగం నాయక్, బాలకృష్ణ, మహేష్, అరిఫ్, విఘ్నేష్, లోకేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.