రేపూరు గ్రామంలో జనసేన పార్టీలో భారీ చేరికలు

కాకినాడ: కరప మండలం, నడకుదురు గ్రామం జనసేన పార్టీ నాయకులు భాస్కర్ తమ్మయ్య, గొల్లపల్లి చంద్ర శేఖర్, తలాటం శ్రీనుల అధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన వైసీపీ యువ నాయకులు వసంత శివ శంకర్ మరియు వసంత విక్కీ నాయకత్వంలో 30 మంది వైసీపీకి రాజీనామాలు చేసి ఆదివారం కాకినాడ రూరల్ మండలం, రేపూరు గ్రామం నందు రోడ్ షో నిర్వహిస్తున్న కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో జనసేనలో చేరారు. వారందరికీ నానాజీ జనసేన పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.