కాపు సంక్షేమ సేనకు మూకుమ్మడి రాజీనామా

మదనపల్లి: రాష్ట్ర కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామజోగయ్య చేస్తున్న పని తీరును ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో కాపు సంక్షేమ సేన మండలం అధ్యక్షులు కమిటీ మెంబెర్స్ విమర్శించారు. ఈ సందర్భంగా కాపు సంక్షేమ సేన మండల అధ్యక్షులు జంగాల గౌతమ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కులాలు, పార్టీల వారీగా విభజించి పార్టీలలో చీలికలు తెస్తూ నియోజకవర్గంలో వర్గాలుగా విడగొడుతున్నారని అన్నారు. గత 5 సంవత్సరాలుగా మండలంలో పనిచేస్తున్నామని కనీసం పలనా వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తున్నామని మండల కమిటీని కానీ గ్రామ కమిటీలను కానీ మాట్లాడిన తరువాత పంపించాలని ప్రశ్నించారు. కావున మా మదనపల్లి మండలం తరుపున మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నామని అన్నారు. మాకు రాజకియ నాయకుడు అయినా కుల నాయకుడు అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఆయన అడుగు జాడల్లో నడుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగాల శివరాం, గజ్జల రెడ్డెప్ప, గ్రానైట్ బాబు, నాగవేణి, జవిలి మోహన్ కృష్ణ, చంద్రశేఖర, తదితరులు పాల్గొన్నారు.