రుద్రంపల్లి గ్రామంలో జనసేన పార్టీలోకి భారీ చేరికలు
కళ్యాణదుర్గం నియోజకవర్గం, కుందుర్పి మండలం, రుద్రంపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్ & జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య సమక్షంలో మరియు కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ & కంబదూరు మండల ఉపాధ్యక్షులు వెంకటేష్-వీరమహిళ శ్రావణి ఆధ్వర్యంలో 28 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ 28 కుటుంబాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి, జనసేన పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ జాయినింగ్ కార్యక్రమంలో కళ్యాణదుర్గం జనసేన ముఖ్య నాయకులు గంగరాజు, కళ్యాణదుర్గం మండల ప్రధాన కార్యదర్శులు కార్తీక్, అనిల్ పాల్యం, సుధాకర్, కుందుర్పి మండలం జనసేన పార్టీ నుండి ఉపాధ్యక్షులు గంగాధర, ప్రసన్న, సంయుక్త కార్యదర్శులు ఇంద్రసేన, ప్రధాన కార్యదర్శులు చౌడప్ప, శరణప్ప, నియోజకవర్గ జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ రాయుడు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-17-at-8.41.03-PM-1024x462.jpeg)