గొడుగుపేట జనసేనలో చేరికలు
మచిలీపట్నం నియోజకవర్గం: గొడుగు పేట జనసేన కార్యాలయంలో భారీగా ఆటో యూనియన్ సభ్యులు మరియు నాయకులు కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఈ సమయంలో జనసేనలో చేరిన యువకులు నేటి నుండి వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలో చేరికలు చూస్తూనే.. ఉండాల్సి వస్తుందని ఎద్దెవా చేశారు. ఆటోలకు జగనన్న ఇచ్చిన 10 వేలు కనపడ్డాయి, కానీ వెనకనుండి ఫైన్ లు వేసి లాగిన డబ్బులు ఎవరికి కనపడడం లేదు అని అనుకుంటే పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగడమే అని అన్నారు. మోటార్ ఫీల్డ్ కు సంబందించి ఏ ఒక్క ఓటు కుడా వైసిపి కి పడబోవని రాసి పెట్టుకోమంటూ జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం కాలేఖాన్ పేట ఆటో యూనియన్ అధ్యక్షులు జానీ బాషా తెలిపారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-20-at-11.48.42-AM.jpeg)