గూడూరు జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గణిత దినోత్సవం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-22-at-6.39.57-PM-1024x576.jpeg)
గూడూరు, బుధవారం గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలులో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ గణిత శాస్త్ర మేధావిగా శ్రీనివాస్ రామానుజన్ చేసిన సేవలను ఆయన సాధించిన విజయాలను తెలియచేయడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ రామనుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివ, సాయి, వసంత్, ఉపాధ్యాయులు రామ్మోహన్, కీర్తి, శ్రీను మరియు మస్తాన్ పాల్గొన్నారు.