మానవత్వం చాటుకున్న చిత్రాడ గ్రామ అయ్యప్ప స్వాములు, మహిళలు

పిఠాపురం: శుక్రవారం రాత్రి నుండె ఒక గుర్తు తెలియని సుమారు 45 సంవత్సరాల వ్యక్తి మద్యం మత్తులో ఉండి చిత్రాడ గ్రామంలో ఉన్న శెట్టిబలిజి రామాలయం వెనక దారి అనుకుని చెరువు గురపడ్డకలో ఇరుక్కుపోవటం జరిగింది. అతను మద్యం మత్తులో ఎలా వెళుతున్నాడో తెలియక చెరువు మద్యగా వెళ్ళిపోయి రాత్రి అంతా చాలా ఇబ్బంది పడుతూ స్పృహ తప్పాడు. తెల్లవారుజామున వెలుతురు వచ్చిన సమయంలో జనసేన నాయకులు పెంకే జగదీష్, బాలు, వీరబాబు, రామకృష్ణ, గణేష్, మణికంఠ, అయ్యప్ప స్వాములు గుడిపైకి వెళ్ళగా ఒక మనిషిలా కనిపించడం ఆ చెరువు మధ్యలో గురపడెక్కలో వ్యక్తిని లేపి బయటికి తీసుకువచ్చి స్నానం చేయించిన స్వాములు ఆయన పరిస్థితి చేతులు వాళ్లు చూసి గమనించి, అక్కడ ఉన్న మహిళలు బట్టలు ఇచ్చి చలికి వణుకు పోతుంటే మంట వేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గ నాయకులు పెంకే జగదీష్ స్వాములు ఆయన్ని పూర్తి వివరాలు అడగ్గా గ్రామం కాకినాడ రూరల్ కరప గ్రామమని నా పేరు రమణ సామర్లకోట మండలం పవర గ్రామం మా కూతురు అల్లుడు లచ్చబాబు దగ్గరికి వెళ్లే సమయంలో ఎలా జరిగిందని తెలియజేయగా ఫోన్ నెంబర్ సాయంతో వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేసి వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది.