మేడిశెట్టి శివరామ్ కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామంలో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి శివరామ్ తల్లి శ్రీమతి మేడిశెట్టి కుసుమ ఇటీవల స్వర్గస్తులయ్యారు.. పెదకార్యం సందర్భంగా శనివారం మేడిశెట్టి శివరామ్ కుటుంబాన్ని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించి, మనోదైర్యం చెప్పి శ్రీమతి మేడిశెట్టి కుసుమ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, రాజానగరం మండల జనసేన పార్టీ ఉప అధ్యక్షులు నాగవరపు భానుశంకర్, సీనియర్ నాయకులు కామిశెట్టి విష్ణు, కలవచర్ల గ్రామ మాజీ ఎంపీటీసీ అబ్బులు, జనసేన పార్టీ వీరమహిళ కామిశెట్టి హిమశ్రీ, చల్లా ప్రసాద్, పెద్ద కాపు తదితరులు పాల్గొన్నారు.