నేడు ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు.. భారీ బందోబస్తు

హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా జైలు నుంచి రఘురామను పోలీసులు తీసుకువచ్చారు. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో ఆర్మీ ఆస్పత్రుల్లో ఈ నెల 21 వరకు ఎంపీకి వైద్య చికిత్స అందజేయనున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రఘురామకు ఈరోజు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు విచారణ చేయనున్నారు. విచారణ మొత్తాన్నీ వీడియో తీయనున్నారు. ఆ వీడియో పుటేజీని సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు అధికారులు సమర్పించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండనున్నారు.