త్వరలోనే ప్రతి మండల కమిటీ మరియు కార్యకర్తలు సమావేశం నిర్వహణ: పులి మల్లి కార్జునరావు

జనసేన పార్టీని సిద్ధాంతాలను నియోజకవర్గ స్థాయిలో ప్రతి గడప గడపకి తీసుకొనే వెళ్లే విధంగా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నానని, మండల కమిటీలను పరిశీలించి ప్రతి మండలంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను, ఆ మండలంలోని సమస్యల్ని తెలుసుకొని సమస్యలు పరిష్కారం దిశగా జనసేన పార్టీని రూపాంతరం చేస్తానని కందుకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్ ఛార్జ్ పులి మల్లి కార్జునరావు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఒకటే నేను తెలియజేస్తా.. పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి పార్టీ లోకి వచ్చినవాడిని నాకు పార్టీ ఏ సూచనలు ఇస్తే నేను అలాగే చేస్తున్నాను.. కానీ కొంతమంది నేను నచ్చకనో.. మరియు ఇంకో కారణాల వల్ల గానీ నా గురుంచి తప్పుగా మాట్లాడితే నాకు ఒరిగేది ఏమి లేదు. నియోజకవర్గస్థాయిలో జనసైనికులు జోలీకి ఎవరు వచ్చినా అప్పుడు చెపుతాను మల్లికార్జున అంటే ఏమిటో.. ఎవరో.. ఉడత బెదిరింపులుకు బయపడి పారిపోయే వ్యక్తి ని కాదు నేను. అంబేద్కర్ భావజాలంతో పెరిగిన వ్యక్తి ని. బయపడడం నాకు తెలియదు. జనసేన పార్టీ కోసం ఎలా పని చేయాలో అలా చేస్తున్నా.. జనసేన పార్టీని కందుకూరు నియోజకవర్గస్థాయిలో 100 శాతం పూర్తి స్థాయిలో బలోపేతం చేసి తీరుతాను. కొన్ని కొన్ని విషయాలు కొందిరిని బాధపెట్టి ఉండవచ్చు.. అవి త్వరలో క్లియర్ చేసి పార్టీని బలోపేతం చేస్తాను. పక్కన వాళ్ళ అలుసుగా మాట్లాడు కొనే అంత వ్యక్తి ని అయితే కాదని ప్రత్రికా ముఖంగా తెలియజేసారు.