ప్రతి పేదవాడికీ కాకినాడలోనే ఇల్లు

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ్ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో 5వ డివిజన్ మాధవనగర్ కనకదుర్గమ్మ గుడి ప్రాంతంలో సిటీ జనరల్ సెక్రెటరీ పెద్దిరెడ్డి ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో మన నివాసానికి ఇళ్ళు కావాలి మన కాకినాడలోనే అని అంటూ మేము సిద్ధం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని చెపుతూ సభలు పెడుతున్నారనీ కాకినాడలోని ప్రజలకు ఇళ్ళు ఇస్తామంటూ సిటీకి దూరంగా వేరే గ్రామంలోకి తోలేస్తూ ఖాళీ చేయించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ ఊరి ప్రజలను ఈ ప్రాంతానికి దూరం చేస్తూ దూరంగా ఇళ్ళు ఇస్తున్నామని నగర బహిష్కరణలాగా చేస్తున్న ఈ వై.సి.పి ప్రభుత్వ చర్యలని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తొందన్నారు. ఈనాడు కాకినాడలోని అన్ని వర్గాలూ మీరు పెంచిన ఆస్తిపన్నులకు, చెత్తపన్నుకు, కరెంటు చార్జీల పెంపుకి మిమ్మల్ని గద్దెదించేందుకు సిద్ధం అని అంటూ నినాదాలు చేసారు, ఈప్రాంతంలోనే వీళ్ళకి ఇళ్ళు ఇవ్వాలని నినందించారు. కాకినాడలోనే ఇళ్ళు పొందే విధంగా వీరందరికీ జనసేనపార్టీ హామీ ఇస్తోందని తెలియచేసారు. జనసేన-తెలుగుదేశం-బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాకా కాకినాడలోని ప్రతి పేదవాడికీ కాకినాడలోనే ఇల్లు ఇస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అట్ల సత్యన్నారాయణ, జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ, సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ, , టేకు రాము, కనిగిరి సుభాష్, పానుగంటి మణికంఠ, మైగాపుల వంశీ, చోడిశెట్టి సతీష్, నిమ్మకాయల రామారావు, ఎండీ షామీర్, పెద్దపటి వీరబాబు, సుజాత, మరియా, లీలా, కంఠ రవి, మధు, కోడి శ్రీను, దుర్గ ప్రసాద్, పాలిక శివ తదితరులు పాల్గొన్నారు.