జనసైనికుని ఆత్మహత్యకేసు విషయంపై సమావేశం
అనకాపల్లి నియోజకవర్గం, కశింకోట మండలం, కొత్తపల్లి బుచ్చయ్యపేట గ్రామంలో వైసీపీ సర్పంచ్ దాడి చేయడంతో.. మనస్తాపానికి గురై సోమవారం ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు సుదర్శన్ శ్రీనివాస్ శర్మ కేసు విషయంలో.. ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనేవిషయమై.. చర్చించేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు.. విశాఖ జిల్లా లీగల్ సెల్ సభ్యులు యర్రా రేవతి మరియు గేదెల రామచంద్రరావు తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కశింకోట మండలం మరియు అనకాపల్లి పట్టణ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-12-at-1.22.22-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-12-at-1.22.22-PM-1-1024x576.jpeg)