అంకిరెడ్డి పల్లె జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం, కొలిమిగుండ్ల మండలం, అంకిరెడ్డి పల్లె గ్రామం, బందర్లపల్లె క్రాస్ లో నాగేంద్ర మరియు వారి మిత్రబృందం ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా కర్నూలు జిల్లా జనసేన నాయకులు అర్షద్ ఎస్.ఎం.డి, నగేష్ అరిగెల, అలాగే నియోజకవర్గ నాయకులు నీలి ప్రభాకర్, నాగప్రసాద్, వేణు, మండల జనసైనికులు చంద్రమౌళి, మహమ్మద్, జ్ఞానప్రసాద్, విష్ణు, అశోక్, జగన్ వీరయ్య, శ్రీనివాసులు, మోహన్, నరసింహ మరియు జనసేనకార్యకర్తలు పాల్గొనడం జరిగింది.