అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో మంగళవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు న్యూ మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఖాసిం మరియు అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాల్వంచ టౌన్ ఎస్సై రాము ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 50 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ ముక్కెంటేశ్వరరావు, అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సోమరాజు దొర, డాక్టర్ సింధు, సతీష్, సైదులు, తపస్వి సింధు, చింత నాగరాజు, జనసేన నాయకులు రాంబాబు, రోషయ్య రెడ్డి నవీన్, శివ, నాగరాజు, మోలా రహిం, మస్తాన్, రసూల్, మీరావలి దేవా, మెగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.