నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన శతఘ్ని న్యూస్ టీం సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు

మంగళగిరి, గురువారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబుని శతఘ్ని న్యూస్ టీం సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గడిచిన రెండు సంవత్సరాల పై నుంచి జనసేన పార్టీ ఎదుగుదలకు మరియు నియోజవర్గ స్థాయిలో ప్రతి రోజూ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా చేస్తున్న ప్రజా పోరాటాలను, సేవలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ అనునిత్యం జనసేన ఎదుగుదలకు శ్రమిస్తున్న శతఘ్ని న్యూస్ ని ప్రత్యేకించి అభినందిస్తూ మున్ముందు పార్టీ చేయబోయే కార్యక్రమంలో తమ వంతు కృషి చేయాలని నాగబాబు శతఘ్ని న్యూస్ టీమ్ కి సూచిస్తూ మరియు వారి కృషికి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జనసేన చేయబోయే ప్రతి కార్యక్రమంలో శతఘ్ని న్యూస్ టీంకి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలియజేశారు.