దుబ్బాక ప్రజాతీర్పును శిరసావహిస్తాం: హరీశ్ రావు

దుబ్బాక ఉపఎన్నిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు మంత్రి హరీశ్ రావు చాలా కృషి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టీఆర్ఎస్ ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అంతా తానే అయి ముందుకు నడిపించారు. కానీ విజయం మాత్రం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును వరించింది. దీంతో మంత్రి హరీశ్ రావు స్పందించారు.

ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమికి తనదే బాధ్యత అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దుబ్బాక ప్రజాతీర్పును శిరసావహిస్తామని ఆయన తెలిపారు. ఓటమికి గల కారణాలు సమీక్షించుకొని లోపాలను సరిదిద్దుకుంటామని హరీశ్‌రావు చెప్పారు. దుబ్బాక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన దుబ్బాక ప్రజలకూ, ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు.