ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీ కి చేరుకున్న మోడీ

ఐదు రోజులపాటు ఇటలీ, బ్రిటన్​లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం తిరిగి భారత్​కు పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా.. ఆయన జీ20 సదస్సు, కాప్​26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు.

“భూమి భవిష్యత్తు గురించి రెండు రోజులపాటు జరిగిన తీవ్రమైన చర్చల తర్వాత గ్లాస్గో నుంచి బయలుదేరాను. పారిస్​ ఒప్పందంలోనీ తీర్మానాలకు భారత్​ కట్టుబడి ఉండటమే గాకుండా.. రానున్న 50 ఏళ్ల కోసం ప్రతిష్ఠాత్మక ఎజెండాను ఏర్పాటు చేసుకుంది” అని మోదీ ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

గ్లాస్గోలోని హోటల్​ నుంచి బయలుదేరే ముందు మోదీ.. అక్కడకు చేరుకున్న చిన్నారులతో ముచ్చటించారు. ప్రవాస భారతీయులతో కలిసి ఆయన సరదాగా డోలు మోగించారు. అనంతరం ఆయనకు వారు వీడ్కోలు పలికారు.