సెక్యూరిటీ లేకుండానే సీక్రెట్ గా గురుద్వారాను సందర్శించిన మోదీ

ఢిల్లీలోని గురుద్వారా సిస్​ గంజ్​ సాహిబ్​ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకస్మికంగా సందర్శించారు. మత బోధకుడు గురు తేగ్​ బహాదూర్​ 400వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. అయితే, ప్రధాని మోదీ ఎలాంటి బందోబస్తు లేకుండానే వెళ్లడం విశేషం. షెడ్యూల్‌లో లేని పర్యటన కావడం వల్ల.. ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్‌ ఆంక్షలు విధించలేదని వెల్లడించాయి.