అనాథ శరణాలయానికి శ్రీమతి అనా కొణిదెల ఆసరా

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ నారపల్లి ప్రాంతంలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి చెందిన అనాథ శరణాలయాన్ని సందర్శించారు. అక్కడి అనాథ బాలబాలికలతో ముచ్చటించి కేక్ కట్ చేశారు. వారి చదువుల గురించి తెలుసుకున్నారు. అయిదుగురు బాలికల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉందని తెలుసుకొని ఆ మొత్తాన్ని శ్రీమతి అనా కొణిదెల గారు అందించారు. అలాగే శరణాలయానికి కావలసిన నిత్యావసర సరకులు, బాలలకు అవసరమైన సామగ్రిని అందించారు.