భవానీలకు భిక్షను అందజేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం, దేవీనవరాత్రులలో భాగంగా కాలినడకన అమ్మవారి కొండకు బయలుదేరిన భవానీలకు మార్గమధ్యంలో “భిక్ష” అందజేసిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. కొత్త వెలుగుబంధ, పాత వెలుగుబంధ, కలవచర్ల గ్రామాలకు చెందిన పలువురు భవాని మాలలు ధరించి కాలినడకన విజయవాడ దుర్గమ్మ కొండకు బయలుదేరిన భవానీలకు మార్గమధ్యంలో కొవ్వూరు వద్ద “బిక్ష “అందజేసిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. భవానీలను క్షేమంగా వెళ్లి, అమ్మవారి దర్శనం చేసుకుని, క్షేమంగా ఇంటికి రావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.