పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

  • రాజానగరం నియోజకవర్గంలో పలు కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి..

రాజానగరం నియోజకవర్గం: సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన గట్టి సత్యనారాయణ మూర్తి మాత్రుమూర్తి గట్టి మహాలక్ష్మి ఇటీవల స్వర్గస్తులయ్యారు.. గురువారం పెదకార్యం కార్యక్రమం రాజమండ్రి కోటి లింగాల రేవులో ఏర్పాటు చేసిన సందర్భంగా వారి కుమారుడు సత్యనారాయణ మూర్తిని వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో అక్కిరెడ్డి రాము ఇటీవల కాలం చేసారని విషయం తెలుసుకుని వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తదనంతరం రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో యర్రంశెట్టి సోమరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు అని తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. అనంతరం రాజానగరం నియోజకవర్గం, దివాన్ చెరువు గ్రామంలో సుంకర వెంకటరమణ గారు ఇటీవల మరణించిన విషయం తెల్సుకుని వారి కుటుంబాన్ని పరామర్శించి మనోదైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, నాగారపు సత్తిబాబు, దాసర కోటేశ్వరరావు, కవల గంగారావు, దాసరి రమేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, ప్రగడ శ్రీహరి, రుద్రం నాగు, అడపా శీను, కవల శివకృష్ణ, దేవన దుర్గ ప్రసాద్, అడ్డాల దొరబాబు, జనసేన నాయకులు యర్రంశెట్టి శ్రీను, యర్రంశెట్టి నాగ, యర్రంశెట్టి ప్రసాద్, అక్కిరెడ్డి వేణు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.