పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్న శ్రీమతి డి.పవిత్ర మరియు శ్రీ నేరెళ్ళ సురేష్

కృష్ణా జిల్లా పామర్రు నియోజక వర్గానికి చెందిన శ్రీమతి డి.పవిత్ర, గుంటూరు నగరానికి చెందిన శ్రీ నేరెళ్ళ సురేష్ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు