కిస్మస్ వేడుకలలో శ్రీమతి వినుత కోట

శ్రీకాళహస్తి నియోజకవర్గం: క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోట సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని కాసా గార్డెన్ వద్ద గల లూథరిన్ చర్చ్ కి వెళ్లి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఆ ఏసునాదుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు పేట చిరంజీవి, పేట చంద్ర, రవి కుమార్ రెడ్డి, గురవయ్య, కవిత, శారద, రాజ్య లక్ష్, లక్ష్మి, గాయత్రి, హేమంత్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.